బప్పీలహరికి కరోనా..ముంబై ఆసుపత్రిలో చేరిక

by సూర్య | Thu, Apr 01, 2021, 09:16 AM

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ బప్పీలహరి కరోనాతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. బప్పీలహరికి కరోనా సోకడంతో అతన్ని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చామని అధికార ప్రతినిధి చెప్పారు. బప్పీలహరికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.బప్పీలహరిని కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బప్పీదాదా అధికార ప్రతినిధి సూచించారు.బప్పీలహరి త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, స్నేహితులు కోరుతూ సందేశాలు పంపించారు.


గతంలో బప్పీలహరి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు తన పేరును రిజిస్టరు చేసుకున్నా వేయించుకోలేదు. అంతలో బప్పీలహరికి కరోనా సోకింది. బప్పీలహరితో పాటు బాలీవుడ్ నలుడు పరేష్ రావల్, అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, సతీష్ కౌశిక్, కార్తిక్ ఆర్యన్ లు ఇటీవల కరోనా బారిన పడ్డారు.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM