by సూర్య | Wed, Mar 31, 2021, 02:44 PM
పవన్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు' అనే సినిమాను చేస్తున్నాడు. పిరియాడిక్ జోనర్లో మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. 180 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ స్పాట్లో ఓ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజా షెడ్యూల్లో కీలక నటులపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు తీస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం గుర్రాలతో ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ కింద పడినట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన ఆయనను ముందుగా నగరంలోని యశోదా అస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారట. ఆ తర్వాత చెన్నైకు తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
Latest News