by సూర్య | Wed, Mar 31, 2021, 02:26 PM
దేవ కట్టా వెన్నెల తో ఒక్కసారిగా థియేటర్స్ లలో నవ్వుల వెన్నెల కురిపించాడు. ఆ తర్వాత ప్రస్థానం తో టాప్ దర్శకుల జాబితాలో చేరే సత్తా ఉందని అందరు అనుకున్నారు..కానీ ఆతర్వాత అబిమానుల ఆశల ఫై నీళ్ళు చల్లాడు..నాగ చైతన్య తో ఆటో నగర్ సూర్య మూవీ చేసి ఘోర పరజేయని చవిచుసాడు..దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మంచు విష్ణు తో డైనమైట్ చిత్రాన్ని చేసి ఉన్న కొంత మంచి పేరు కూడా చెడగోట్టుకున్నాడు..ఈ సినిమా తర్వాత తెలుగులో అడ్రెస్ లేకుండా పోయాడు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్.. సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని చెప్పేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఏప్రిల్ 5న ఈ చిత్ర టీజర్ను విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్గా చిత్రయూనిట్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు.
Latest News