by సూర్య | Tue, Mar 30, 2021, 04:35 PM
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా వచ్చిన 'చావు కబురు చల్లగా' సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కార్తికేయ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. 'చావు కబురు చల్లగా నాలో ఉన్న కొత్త నటుడికి బయటకు తీసింది. చాలా మంది హృదయాలకు నన్ను దగ్గర చేసింది. మీ మెసేజ్ లను చదువుతున్నపుడు బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు చాలా గర్వంగా అనిపించింది. సినిమాను ఇష్టపడని ప్రేక్షకులు నాకు మరోసారి అవకాశం ఇవ్వాలి. తప్పులను సరిదిద్దుకొని..ఇలా జరుగుకుండా చూసుకుంటా' అంటూ కార్తికేయ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
Latest News