by సూర్య | Tue, Mar 30, 2021, 03:48 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రామాయణం నేపథ్యంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్ నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో 3డీ టెక్నాలజీలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మహేశ్ బాబు సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన కలిసి రామాయణాన్ని 3డి ఫార్మాట్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీ, ‘మామ్’ దర్శకుడు రవి ఉడయార్ ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నారట. రామాయణం ఇతీహాసం నేపథ్యంలో సినిమాను తీయబోతున్నట్లు మధు మంతెన, అల్లు అరవింద్ గతంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని 3 భాగాలుగా తెరకెక్కించబోతున్నామని, మొదటి భాగాన్ని 2021లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మహేశ్ తో ఈ ప్రాజెక్టుని తెరకెక్కించాలని నిర్మాతలు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సీతగా దీపికా పదుకోన్, రావణుడిగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి మహేశ్ రామాయణం ఉంటుందా? ఎప్పడు పట్టాలెక్కుతుందో చూడాలి.
Latest News