by సూర్య | Tue, Mar 30, 2021, 03:35 PM
ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. ఈ సినిమాను మహానటుడు ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. మరోవైపు ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. గతంలో ఈయన బాలకృష్ణ, బాపు కలయికలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో విలన్ పాత్ర ఉందట. ఈ క్యారెక్టర్ కోసం శరత్ కుమార్ను తీసుకున్నట్టు సమాచారం. త్వరలో శరత్ కుమార్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. అంతేకాదు బాలయ్య, శరత్ కుమార్ మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉందట. ఈ సినిమాలో ఇదే హైలెట్ కానున్నట్టు సమాచారం.
Latest News