పవన్ సరసన నిత్యామీనన్.. సాయిపల్లవికేమైంది?

by సూర్య | Thu, Mar 25, 2021, 01:08 PM

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాతో పాటు మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమా రీమేక్ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. రెండు సినిమాల షెడ్యూల్స్‌ను ఓ ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఈ రెండింటిలో ముందుగా మ‌ల‌యాళ రీమేకే ముందుగా పూర్త‌వుతుంది. ఇందులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు జోడీగా సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా అనుకున్నారు. ముందు సాయిప‌ల్ల‌వి చూస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలు కాక‌పోవ‌డంతో ఆమె సింపుల్‌గా నో చెప్పేసింది. దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్ వెతుకులాట‌లో ప‌డ్డారు. ఇప్పుడు వారి అన్వేష‌ణ ఫ‌లించింద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో జోడీ క‌ట్ట‌డానికి నిత్యామీన‌న్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.


నిత్యామీన‌న్‌.. తెలుగులో న‌టించి చాలా కాల‌మే అయ్యింది. అయితే ఇప్పుడు న‌టిస్తున్నా చాలా పెద్ద హీరోతో న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇదే సినిమాలో రానా ద‌గ్గుబాటి కూడా హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రానా జోడీగా ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తుంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బిల్లా రంగా అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఉండే అహం వ‌ల్ల ఓ చిన్న స‌మ‌స్య ఎంత వ‌ర‌కు దారి తీసింద‌నే ఓ పాయింట్ మీద ఈ సినిమాను తెర‌కెక్కించారు. శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో వేసిన ఓ పోలీస్ స్టేష‌న్ సెట్‌.. ఓ విలేజ్ సెట్‌లో నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM