సినీ పరిశ్రమలో మరో విషాదం..

by సూర్య | Tue, Jan 19, 2021, 12:40 PM

ప్రముఖ నిర్మాత వి. దొరస్వామి సోమవారం ఉదయం ఆరోగ్య కారణాల రిత్యా తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. దీంతో ఆయన మరణం పట్ల టాలీవుడ్‌ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. దొరస్వామి రాజు నిర్మాతగానే కాకుండా పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరువలేని సేవలు చేశాడని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కొనియాడారు. ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమాకు దొరస్వామి రాజునే నిర్మాతని అని తెలిసిందే. అంతేకాదు నాగార్జున అన్నమయ్యకు కూడా దొరస్వామినే నిర్మాత. ఇక అభిమానుల సంద‌ర్శ‌నార్దం దొర‌స్వామి పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబ‌ర్‌లో ఉంచారు. దొర‌స్వామి పార్ధీవ దేహానికి దర్శకుడు రాజ‌మౌళి, నటుడు, నిర్మాత ముర‌ళీ మోహ‌న్, మరో ప్రముఖ అశ్వినీద‌త్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM