by సూర్య | Mon, Jan 18, 2021, 05:05 PM
ఎన్టీఆర్ 25వ వర్ధంతిని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు బాలకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు పండ్లు అందించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఎన్టీఆర్... పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించారని తెలిపారు. తమ తల్లి కోరిక మేరకు క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలని ఈ ఆస్పత్రిని నిర్మించారన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ వైద్య సిబ్బంది అద్భుత సేవలందించారని కొనియాడారు
Latest News