మరో వివాదంలో కంగనా..

by సూర్య | Mon, Jan 18, 2021, 12:52 PM

నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌతో మరో వివాదంలో ఇరుక్కున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం ఆమె బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. సినీ రంగం నుంచి రాజకీయల వరకు ఎవరినీ వదలడం లేదు. దీంతో ఇప్పుడు ఆమె దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంగనా రనౌత్ కి ఓ రచయిత లీగల్ నోటీసులు అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే కంగనా రనౌత్‌ ఇటీవల ‘మణికర్ణిక’ సినిమాకు సీక్వెల్‌గా ‘మణికర్ణిక.. ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’ పేరుతో కాశ్మీరీ రాణి జీవితగాథను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే విషయమై రచయిత ఆశిష్‌ కౌల్‌ అనే వ్యక్తి కంగనా రనౌత్‌కు లీగల్‌ నోటీసులు పంపించారు. కాశ్మీరీ రాణి జీవితగాథను ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’ పేరుతో పుస్తకాన్ని ఇదివరకే ప్రచురించారు. 2017లో ఈ పుస్తకం ఇంగ్లీష్‌ వెర్షన్‌ కూడా విడుదలైంది. కాశ్మీర్‌ రాణి దిద్దా జీవితగాథకు సంబంధించి అశిష్‌ కౌల్‌ హక్కులను కలిగి ఉన్నాడు.
దీంతో తన అనుమతి లేకుండా కంగనా కాశ్మీర్‌ రాణి జీవిత కథను సినిమాగా తెరకెక్కించడాన్ని రచయిత ఆశిష్ కౌల్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కంగనాకు లీగల్ నోటీసులు పంపాడు. మరి ఆశిష్‌ పంపిన నోటీసులపై కంగనా రనౌత్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM