ముంబైలో సమంత బిజీబిజీ!
by సూర్య |
Sun, Jan 17, 2021, 11:11 AM
ప్రముఖ కథానాయిక సమంత డిజిటల్ మాధ్యమంపై కూడా సత్తా చాటుతోంది. సమంత ఇప్పటికే ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం సెలబ్రిటీ టాక్ షో `సామ్జామ్`ను విజయవంతంగా నిర్వహించింది. త్వరలో `ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిలో సమంత తీవ్రవాదిగా నెగిటివ్ రోల్లో కనిపించనుంది.వచ్చే నెల 12వ తేదీ నుంచి ఈ కార్యక్రమం `ప్రైమ్ వీడియోస్` ద్వారా స్ట్రీమింగ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. మనోజ్ బాజ్పాయితోపాటు సమంత, ప్రియమణి ముంబైలో ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రముఖ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నెల 19న `ఫ్యామిలీ మేన్-2` ట్రైలర్ విడుదల కాబోతోంది.
Latest News