by సూర్య | Fri, Jan 15, 2021, 05:22 PM
అక్కినేని అఖిల్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. బుధవారం రోజున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు సరైన హిట్టు లేని అఖిల్ ప్రస్తుతం ఈ సినిమాపైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Latest News