by సూర్య | Mon, Jan 11, 2021, 05:31 PM
రియల్ హీరో సోనూసూద్ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కాడు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తనకు జారీచేసిన నోటీసులపై సోనూసూద్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. జుహు ఆవాస ప్రాంతంలోని సోనూసూద్ ఇంటిని ఎటువంటి అధికారిక అనుమతుల్లేకుండా మార్పులు చేర్పులతో హోటల్గా మార్చారంటూ బీఎంసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆరు అంతస్థుల 'శక్తి సాగర్' భవనంలో చట్టవిరుద్ధంగా, అనధికారికంగా ఎంటువంటి మార్పులు చేయలేదని ఆయన పిటిషన్ స్పష్టం చేశారు. 'మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ప్లానింగ్' (ఎంఆర్టీపీ) అనుమతించిన మార్పులు మాత్రమే చేసినట్లు నటుడు సోనూసూద్ తెలిపారు. జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ సారథ్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై నేగు వాదనలు వింటుంది.
Latest News