by సూర్య | Mon, Jan 11, 2021, 03:50 PM
అనారోగ్య కారణాలతో రాజకీయ పార్టీ ఆలోచనను విరమించుకున్న తమిళ సూపర్స్టార్ రజినీ కాంత్.. తన నిర్ణయం విషయంలో మార్పు ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన అభిమానులకు సోమవారం లేఖ రాశారు. ‘నా నిర్ణయంలో మార్పు ఉండబోదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాలేను.. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి.. రాజకీయ పార్టీని ప్రారంభించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను అభిమానులు నిర్వహించవద్దు’ అని రజినీ తన లేఖలో పేర్కొన్నారు.
Latest News