by సూర్య | Mon, Jan 11, 2021, 02:44 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. ఈ సినిమా టీజర్ ను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. ఏంరా వదిలేస్తావా నన్నూ? అంటూ సాయి పల్లవి చెబుతోన్న డైలాగ్ సినీ అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘ఏయ్ పిల్లా’ అనే పాట విడుదలైంది. ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ టీజర్ లో నాగచైతన్య కూడా తెలంగాణ యాసలో మాట్లాడాడు.
Latest News