by సూర్య | Sat, Jan 09, 2021, 11:59 AM
ప్రముఖ నటి ప్రియమణి పలు సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం విరాటపర్వం, నారప్ప సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటిస్తోంది. అయితే తాజాగా ప్రియమణికి చిరంజీవి నటించే సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహించనున్నారు. మలయాళంలో మంజు వరియర్ పోషించిన కీలక పాత్రకు ప్రియమణిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇప్పటికే ఇందులో మరో ముఖ్య పాత్రకు సత్యదేవ్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' పూర్తయ్యాక, వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
Latest News