తమిళనాడు గవర్నర్ గా రెబల్ స్టార్..?

by సూర్య | Fri, Jan 08, 2021, 12:20 PM

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్ గా నియమించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణంరాజుకు అభినందనలు తెలుపుతూ పలువురు అభిమానులు ట్వీట్లు కూడా చేస్తున్నారు. హీరో ప్రభాస్ అభిమానులు కూడా సంబరాల్లో మునిగిపోతున్నారు. కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా.. బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఆ మధ్య ప్రభాస్ ను తీసుకొని వెళ్లి ప్రధాని మోదీని కూడా కలిశారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా కృష్ణంరాజు పని చేశారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన.. ఆ తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం మళ్లీ బీజేపీలో చేరారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM