by సూర్య | Wed, Jan 06, 2021, 10:39 AM
ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి తాప్సీ పన్ను. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. అనంతరం తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది.
ఇక బాలీవుడ్లో నటించిన ‘పింక్’ చిత్రంతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడి నుంచి తాప్సీకి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే వచ్చాయి. వాటిని సక్రమంగా వినియోగించుకున్న తాప్సీ మంచి విజయాలను సొంతం చేసుకుంటూ.. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్గా మారింది. ఇక ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం తర్వాత తాప్సీ మళ్లీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ తెలుగులో నటించడానికి ఓకే చెప్పనట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వం వహిస్తున్న ‘అలివేలు వెంకటరమణ’ చిత్రంలో నటించడానికి తాప్సీ అంగీకరం తెలిపిందని టాక్. ఇక ఈ చిత్రంలో మొదట కాజల్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఈ ఛాన్స్ తాప్సీ కొట్టేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించనున్నాడని చిత్ర యూనిట్ అప్పట్లో ప్రకటించింది. అయితే తాజాగా గోపి చంద్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.
Latest News