by సూర్య | Mon, Jan 04, 2021, 01:18 PM
హైదరాబాద్ : సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో రేణుదేశాయ్ ఓ కీలక పాత్రలో పోషించనున్నారని వార్తలొచ్చాయి. అయితే అది ఏ తరహా పాత్ర అయ్యి ఉంటుంది అని... రేణుదేశారు అభిమానుల్లో కూడా ఆసక్తిని పెంచింది. కాగా, ఇందులో మహేష్కి వదినమ్మ పాత్రలో రేణుదేశాయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అరుదైన పాత్రలో నటించే అవకాశం రాగానే రేణుదేశాయ్ కూడా వెంటనే ఒప్పుకున్నట్లు.. ఆ పాత్రపై ఎంతో ఆసక్తి చూపించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ఓ బ్యాంకు అధికారి కుమారుడిగా నటిస్తున్నారు. వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఒక బడా బిజినెస్మేన్ నుంచి డబ్బు పిండేవాడిగా.. మహేష్లోని మాస్ యాంగిల్ స్పెషల్గా ఆకట్టుకుంటుందట. అలాగే ఈ సినిమాలో మహేష్ పాత్రలో విభిన్నగెటప్పులతో.. లవ్స్టోరీ కూడా రక్తి కటించేవిధంగా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా.. . మైత్రి మూవీ మేకర్స్ -14రీల్స్ ప్లస్- జీఎంబీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News