by సూర్య | Sat, Jan 02, 2021, 03:57 PM
ఆడబిడ్డకి జన్మనిచ్చింది హీరోయిన్ పూజా కుమార్. విశాల్ జోషి అనే అమెరికా బిజినెస్ మ్యాన్ ని వివాహమాడి అమెరికాలోనే సెటిల్ అయిందీ బ్యూటీ. అయితే పూజ తల్లి అయినట్టు, ఒక అమ్మాయికి జన్మించినట్టు తాము ఎంతో సంతోషంగా ఉన్నాం అని ఆమె భర్త విశాల్ తెలిపారు. విశాల్ మాట్లాడుతూ నా కూతురుని, నా భార్యను నేను ఎంతో ప్రేమిస్తున్నాను. ఇంతకాలం మేం ఇద్దరంగా వున్నాం ఇప్పుడు ముగ్గురం అయ్యాము, మా ప్రపంచంలోకి మా కూతురు ప్రవేశించింది అంటూ పోస్ట్ చేసారు. పూజా కుమార్, మాజీ మిస్ ఇండియా యుఎస్ఎ, 2000 లో కాదల్ రోజావే చిత్రం ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది, కమల్ హాసన్ సరసన యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విశ్వరూపంలో నటించి బాగా ఫేమస్ అయింది. అటుపై విశాల్ ని పెళ్లి చేసుకొని హాలీవుడ్ లో కూడా మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్ అండ్ బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99 వంటి సినిమాలో నటించింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.