by సూర్య | Mon, Oct 19, 2020, 12:43 PM
నవంబర్ తొలి వారంలో ‘వకీల్ సాబ్’ సెట్స్లో పవన్కల్యాణ్ అడుగు పెడతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కరోనాకి ముందు ఆయనపై చాలా వరకూ సన్నివేశాలను తెరకెక్కించారు. లాక్డౌన్ వల్ల చిత్రీకరణకు తాత్కాలికంగా విరామం ఇవ్వవలసి వచ్చింది. ఆ తర్వాత అన్లాక్లోనూ... కొన్ని రోజుల క్రితం సినిమా చిత్రీకరణ చేశారు. అయితే, ఆ షెడ్యూల్లో పవన్ పాల్గొనలేదు. నివేదా థామస్, అంజలి, అనన్యా నాగళ్లపై దర్శకుడు శ్రీరామ్ వేణు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇప్పుడు చిత్రీకరణకు చిన్నపాటి విరామం ఇచ్చారు. మళ్లీ నవంబర్ తొలి వారం నుంచి చివరి షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇందులో పవన్ పాల్గొంటారు. విశ్రాంతి తీసుకోకుండా నిర్విరామంగా చిత్రాన్ని పూర్తి చేస్తారని తెలిసింది. డిసెంబర్కి సినిమా సిద్ధం కానుంది. పవన్కల్యాణ్ న్యాయవాదిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ కథానాయిక. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News