షూటింగ్ లో తొలి రెండ్రోజలు చాలా భయంగా అనిపించింది : పూజ హెగ్డే

by సూర్య | Sun, Oct 18, 2020, 01:53 PM

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటలీలో జరుగుతోంది. ఇటలీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో, నటి పూజా హెగ్డే తమ షూటింగ్ అనుభవాలను వివరించారు.


"ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. షూటింగ్ లో తొలి రెండ్రోజలు చాలా భయంగా అనిపించింది. ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాను. ఆ తర్వాత మామూలుగా అనిపిస్తోంది. ఇటలీ పరిస్థితులకు అలవాటు పడిపోయాను. ఇటలీలో ఎంతో జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నాం. చిన్న సెట్ వేసుకుని, చాలా తక్కువమందితో చిత్రీకరణ చేస్తున్నాం. సెట్ లోకి అడుగుపెట్టేముందు అందరికీ కరోనా టెస్టులు తప్పనిసరి. సెట్ లో ఉంటే మాస్కు వేసుకోవాల్సిందే. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్కు తీసేస్తున్నాం" అని వెల్లడించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM