by సూర్య | Fri, Oct 16, 2020, 03:31 PM
'డాన్శీను, బలుపు' వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'క్రాక్'. ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. తుది దశ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ స్పెషల్ నెంబర్లో రవితేజతో పాటు అప్సరా రాణి కాలుకదుపుతోంది. జానీ మాస్టర్ ఈ సాంగ్కు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ షెడ్యూల్తో చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత రిలీజ్ డేట్పై చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి రానుంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలోసముద్రఖని, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ ఇందులోపవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు.
Latest News