by సూర్య | Fri, Oct 16, 2020, 03:19 PM
జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై నిన్నటికి 16 ఏళ్లు అవుతున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర ఫొటో వైరల్ అవుతోంది. సినిమా విజయవంతమైన సందర్భంగా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఓ పార్టీలో పలువురు హీరోలు పాల్గొన్నారు.
వారిలో , సూపర్స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరో శ్రీకాంత్, సుమంత్, తరుణ్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, జయంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు.
Latest News