by సూర్య | Fri, Oct 16, 2020, 10:51 AM
ఒక్క సినిమా చాలు ఆకాశానికెత్తేయాలన్నా.. అథ: పాతాళానికి తొక్కేయాలన్నా. అలా అర్జున్ రెడ్డి సినిమా హీరోగా విజయ్ దేవరకొండను, హీరోయిన్గా షాలినీ పాండేను ఓ రేంజ్లో నిలబెట్టేశాయి. అయితే అలా వచ్చిన లక్ను విజయ్ చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు. వరుసగా ఆఫర్లు రావడం, బ్లాక్ బస్టర్ హిట్లు పడటంతో స్టార్ స్టేటస్ను సంపాదించుకున్నాడు. కానీ షాలినీ పాండే మాత్రం వెనుకబడిపోయింది.
షాలినీ పాండే అర్జున్ రెడ్డి తరువాత తెలుగులో హీరోయిన్గా మళ్లీ ఒక్కసినిమా కూడా చేయలేదు. మహానటి చిత్రంలో నటించింది. కానీ అది అతిథి పాత్రే. తాజాగా నిశ్శబ్దం సినిమాలో కనిపించినా అది కూడా గెస్ట్ రోలే. ఇలా తెలుగులో నేరుగా పలకరించలేకపోయింది. అదే తమిళంలో షాలినీ పాండే బాగానే బిజీ అవుతోంది. 100 పర్సెంట్ లవ్ చిత్రానికి రీమేక్గా తమిళంలో తెరకెక్కిన చిత్రంలో షాలినీ హీరోయిన్గా నటించింది.షాలినీ వెండితెరపై అంతగా మెరవకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆ మధ్య బాత్ టబ్లో ఫోటో షూట్ చేసి తెగ హల్చల్ చేసింది. ఇక తాజాగా క్లీవేజ్ షోతో షాలినీ పాండే నెట్టింట్లో మంట పెడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. షాలినీ చేసిన అందాల ఆరబోతకు కామెంట్లు, లైకులతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.