by సూర్య | Tue, Oct 13, 2020, 03:21 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్స్టోరీ `రాధేశ్యామ్`. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు (అక్టోబర్ 13) ఆమె ఫస్ట్లుక్ విడుదలైంది.
ఈ రోజు పూజతోపాటు `రాధేశ్యామ్` టీమ్లోని కునాల్ రాయ్ కపూర్ కూడా బర్త్డే జరుపుకుంటున్నాడు. అతనికి విష్ చేస్తూ పూజ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో పూజ, కునాల్తోపాటు ప్రభాస్ కూడా ఉన్నాడు. ఇటలీ వీధుల్లో ముగ్గురూ మాస్క్ ధరించి ఫొటోకు ఫోజులిచ్చారు. వచ్చే రెండు నెలల్లో మిగిలిన షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
Latest News