చాలా ఆలస్యంగా, చాలా కూల్ గా బాలీవుడ్ ప్రతిస్పందించింది : ఆర్జీవీ

by సూర్య | Tue, Oct 13, 2020, 01:58 PM

బాలీవుడ్‌ సినీ పరిశ్రమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ, ఈ సినీ పరిశ్రమ డ్రగ్స్‌ బానిసలతో నిండిపోయిందని రిపబ్లిక్‌ టీవీ, టైమ్స్‌ నౌ చానెళ్లు కథనాలు ప్రసారం చేశాయని బాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరణ్‌ జొహార్‌, యశ్‌ రాజ్‌, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్ కు చెందిన సంస్థలు సహా 38 నిర్మాణ సంస్థలు వ్యాజ్యం దాఖలు చేశాయి.


రిపబ్లిక్‌ టీవీకి చెందిన అర్ణబ్‌ గోస్వామి, ప్రదీప్‌ భండారితో పాటు టైమ్స్‌ నౌకు చెందిన రాహుల్‌ శివ్‌ శంకర్‌, నవికా కుమార్‌లు బాలీవుడ్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ వారి తీరును ఎద్దేవా చేశారు.


‘చాలా ఆలస్యంగా, చాలా కూల్ గా బాలీవుడ్ ప్రతిస్పందించింది. ఢిల్లీ హైకోర్టులో సినీ రంగ ప్రముఖులు ఫిర్యాదు చేయడం.. బడి పిల్లాడు తమ టీచర్ వద్దకు వెళ్లి 'టీచర్ టీచర్ ఆ అర్ణబ్ మమ్మల్ని తిడుతున్నాడు టీచర్' అని చెప్పినట్లు ఉంది’ అని రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా చేశారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM