తనకు న్యాయం జరిగేలా చూడాలని రాష్రపతిని కోరిన పాయల్...

by సూర్య | Mon, Oct 12, 2020, 04:13 PM

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ ఇటీవల ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని, తన కేసు విషయంలో ఇప్పటి వరకు పురోగతి లేదని తెలుపుతూ భారత రాష్ట్రపతికి పాయల్ తాజాగా ఓ లేఖ రాసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించింది. 


`గతంలో నాపై జరిగిన లైంగిక దాడి గురించి ముంబై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నాకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని నిందితుడు నన్ను వేధింపులకు గురి చేశాడు. ఈ విషయమై నేను 22-9-2020న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అయితే ఇప్పటివరకు ఈ కేసు విషయంలో పురోగతి లేదు. నిందితుడు ప్రముఖ వ్యక్తి కావడంతో పోలీసులు అతని జోలికి వెళ్లడం లేదు. ఇదే నేరం ఎవరైనా పేద వ్యక్తి చేసి ఉంటే ఈ పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ, నా కేసులో నిందితుడు ప్రముఖుడు. అందుకే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. బాధితురాలినైన నేను న్యాయం కోసం అందరి తలుపులూ తడుతున్నాను. ఈ కేసులో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాన`ని పాయల్ ఆ లేఖలో పేర్కొంది. ఆ లేఖను తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.  

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM