గుణశేఖర్ శకుంతలం మూవీలో పూజా...?

by సూర్య | Mon, Oct 12, 2020, 02:03 PM


గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తర్వాత హిరణ్యకశ్యప సినిమా చేయనున్నట్టు ప్రకటించడం... రీసెంట్ గా ఈ సినిమా కంటే ముందుగా శకుంతలం అనే సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. గుణశేఖర్ ఇలా ఎనౌన్స్ చేయడం ఒక విధంగా షాకే అని చెప్పచ్చు. శకుంతలం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. గుణశేఖర్ రుద్రమదేవిలో నటించిన అనుష్క ఈ సినిమాలో కూడా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు కరెక్ట్ గా సరిపోతాయి.

అందుచేత అనుష్కనే కన్ ఫర్మ్ చేస్తారు అనుకున్నారు. అయితే... అనుష్క తర్వాత మరో పేరు తెర పైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే. అవును.. పూజా హేగ్డే శకుంతలం సినిమాలో నటించనున్నట్టు వార్తలు రావడంతో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ కదా. ఈమెను కూడా పరిశీలిస్తున్నారు అనుకున్నారు. తాజా వార్త ఏంటంటే...  పూజాను కాంటాక్ట్ చేయలేదు. అసలు ఆమెను అనుకోలేదు అని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నారని తెలిసింది.

 

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM