by సూర్య | Mon, Oct 12, 2020, 10:49 AM
శ్రీపతి దర్శకత్వంలో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా 800 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఈ సినిమాని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.ఈ చిత్రంలో ముత్తయ్య మురళీధరన్ భార్య మధిమలర్ పాత్రలో రజిష విజయన్ నటించనున్నారని సమాచారం. రజిష కొన్ని మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించారు. కాగా ప్రస్తుతం స్టార్ హీరో ధనుష్ సరసన ఓ సినిమా చేస్తున్నారు. మంగళవారం 800 చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని సమాచారం.
Latest News