డైరెక్షన్ చేయాలనేది నా కోరిక

by సూర్య | Mon, Oct 12, 2020, 09:21 AM

హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతోందట. ‘పుత్తమ్‌పుదు కాలై’ అనేఆంథాలజీ చిత్రంలో నటిస్తున్న అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్‌ దర్శకత్వం చేయాలని ఆశపడుతోంది. తండ్రి ప్రియదర్శన్‌ ప్రముఖ దర్శకుడిగా ఉండటంతో ఆమె దర్శకత్వం చేయాలని ఉబలాడపడుతోంది.  ప్రముఖ దర్శకులు గౌతమ్‌ వాసుదేవమేనన్‌, సుధా కొంగర, రాజీవ్‌ మేనన్‌, కార్తీక్‌ సుబ్బురాజ్‌, సుహాసిని మణిరత్నం సంయుక్తంగా దర్శకత్వం  వహిస్తున్న ఆంథాలజీ చిత్రం ‘పుత్తమ్‌ పుదు కాలై’. ఇందులో ‘ఇలమై ఇదో ఇదో’ అనే కథకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలో కాళిదాస్‌ జయరామ్‌, ఊర్వశి, కళ్యాణి ప్రియదర్శన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి కళ్యాణి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ… ‘ఇలమై ఇదో ఇదో’ షూటింగ్‌ మూడు రోజులపాటు జరిగిందని, హీరో కాళిదాస్‌ జయరామన్‌ తమ ఫ్యామిలీ ఫ్రెండ్‌ అని, మంచి నటుడని, షూటింగ్‌ స్పాట్‌లో ఇద్దరూ జాలీగా గడిపామని తెలిపారు. సెట్‌లో ఐదుగురు మాత్రమే ఉండేవారని, తన మేకప్‌ను తానే వేసుకున్నానని ఈ అనుభవం వింతగా అనిపించిందని చెప్పారు. ఇక తండ్రిలాగే తాను కూడా సినిమాలకు దర్శకత్వం వహించాలనే కోరిక బలంగా ఉందని, అది ఎప్పుడు నెరవేరుతుందో తానిప్పుడే చెప్పలేనని కళ్యాణి ప్రియదర్శన్‌ అన్నారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM