by సూర్య | Sun, Oct 11, 2020, 03:21 PM
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దిశ’ వివాదాస్పదమైన విషయం విదితమే. ఈ సినిమాను ఆపాలంటూ దిశ తల్లిదండ్రులు కోర్టను ఆశ్రయించారు. అయితే ఇవాళ ఆర్జీవీ ఇంటి వద్ద మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ‘దిశ’ సినిమాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలా జరిగితే సినిమా తీస్తారా? అని మహిళా సంఘాలు నిలదీస్తున్నాయి. రౌడీ వర్మ అంటూ మహిళల నినాదాలు హోరెత్తించారు. కాగా ఇవాళ ఉదయం ఆర్జీవీ ఇంటి ముందు దిశ కుటుంబ సభ్యులు కూడా ధర్నా చేశారు.
Latest News