ఇటలీకి పయనమైన బుట్టబొమ్మ...

by సూర్య | Fri, Oct 09, 2020, 03:55 PM

ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు జార్జియాలో ఎక్కువ భాగం జరిగింది. అయితే, లాక్ డౌన్ కారణంగా బ్రేక్ రావడంతో ఆరు నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఇటలీలో చేయాల్సిన ఇతర షూటింగ్ భాగాన్ని హైదరాబాదులోనే సెట్స్ వేసి చేద్దామని దర్శక నిర్మాతలు భావించి, సెట్స్ కూడా వేశారు.


అయితే, ఇప్పుడు యూరప్ లో కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడడంతో సహజత్వం కోసం అక్కడికే వెళ్లి షూటింగ్ చేయాలని నిర్ణయించి యూనిట్ ఇటీవల ఇటలీకి వెళ్లింది. హీరో ప్రభాస్ కూడా వెళ్లడంతో గత కొన్ని రోజులుగా అక్కడ ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు కథానాయిక పూజ హెగ్డే కూడా ఇటలీ వెళ్లి షూటింగులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.


 


ఈ క్రమంలో మరికొన్ని రోజుల పాటు ఇటలీలో వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలను, పాటలను అక్కడ చిత్రీకరిస్తారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నందున హిందీ వెర్షన్ ని కూడా విడుదల చేస్తారు.

Latest News
 
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM