ప్ర‌జ‌ల‌ను ప్ర‌శంసిస్తూ ట్విట్ చేసిన మోదీ రిట్విట్ చేసిన రకుల్...

by సూర్య | Thu, Oct 08, 2020, 03:28 PM

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ పిలుపులో భాగస్వామ్యం అవ్వండి అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ట్వీట్ చేసింది. కొవిడ్-19పై పోరాడుతోన్న‌ క‌రోనా వారియ‌ర్స్ కు, ప్ర‌జ‌ల‌ను ప్ర‌శంసిస్తూ మోదీ చేసిన ట్వీట్ ను ఆమె రీట్వీట్ చేసింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో స‌మష్టిగా మ‌నం చేస్తోన్న ప్ర‌య‌త్నాలు చాలా మంది ప్రాణాల‌ను కాపాడాయ‌ని మోదీ అన్నారు. ఈ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించాల‌ని, వైర‌స్ నుంచి పౌరుల‌ను కాపాడాల‌ని ఆయ‌న కోరారు.


ఈ ట్వీట్ ను ర‌కుల్ రీట్వీట్ చేస్తూ... "క‌రోనా నుంచి మ‌న‌ల్ని సుర‌క్షితంగా ఉంచ‌డానికి మూడు ఆయుధాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవే మాస్కు, చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవ‌డం, భౌతిక దూరం. కొవిడ్ పై పోరాటానికి ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన పిలుపున‌కు మ‌ద్ద‌తిద్దాం. క‌రోనాపై పోరాడ‌దాం.. మ‌న‌ల్ని మ‌నం సుర‌క్షితంగా ఉంచుకుంటూ మ‌న కుటుంబాన్ని సుర‌క్షితంగా ఉంచుదాం" అని ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM