సాయి ధరమ్ తేజ్ తో జతకట్టనున్న ఐశ్వర్య రాజేష్?

by సూర్య | Thu, Oct 08, 2020, 01:35 PM

వరుస ఫెయిల్యూర్స్‌తో సినిమా కెరియర్ ముగుస్తుందనే టైంలో చిత్రలహరితో కాస్త తేరుకున్న తేజ్. ప్రతి రోజు పండగే సినిమాతో హిట్ కొట్టాడు. త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో సరిగ్గా లాక్ డౌన్ మొదలు కావడానికి పది రోజులు ముందు సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు కూడా తెలిపారు.


ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని జేబీ మూవీస్ పతాకంపై భగవాన్, పుల్లారావులు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ ని ఈ సినిమాలో హీరోయిన్ అనుకున్నారు. ఆమె ఓపెనింగ్ కు కౌడ హాజరయింది. అయితే ఆమె ఈ సినిమాలో ఇప్పుడు నటించడం లేదని అంటున్నారు. ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టాలు. ఇక ఈ విషయాన్ని నిన్న తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు సాయి తేజ్.


దేవ కట్టతో కలిసి ప్రీప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్న ఫొటో ఒకదాన్ని షేర్ చేసి 14వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నామని, దేవ కట్టా కథను గొప్పగా రాశారని, సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని పోస్ట్ పెట్టారు. అయితే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ గా విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారట. అలానే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం జగపతి బాబు, రమ్యకృష్ణలను కూడా సంప్రదించారని అంటున్నారు. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM