by సూర్య | Thu, Oct 08, 2020, 11:40 AM
ఎంతో ఆసక్తి రేకెత్తించిన `నిశ్శబ్దం` సినిమా ఈ నెల రెండో తేదీన అమేజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు నటించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు `నిశ్శబ్దం` టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
తాజాగా `నిశ్శబ్దం` టీమ్కు హైదరాబాద్కు చెందిన ఓ లోకల్ ఛానెల్ షాకిచ్చింది. అతి త్వరలో తమ ఛానెల్లో `నిశ్శబ్దం` సినిమాను ప్రదర్శించబోతున్నట్టు ప్రకటించింది. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లడంతో ఆ ఛానల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు నష్టపరిహారం కింద 1.1 కోట్ల రూపాయలు చెల్లించాలని వారికి లీగల్ నోటీస్లు కూడా పంపించారు. ఇక, ఈ సినిమా హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ మరో రూ.30 లక్షలు నష్టపరిహారం కోరుతోందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వెబ్సైట్ కథానాన్ని ప్రచురించగా.. దర్శకుడు హేమంత్ మధుకర్ దానిని రీ-ట్వీట్ చేశారు.
Latest News