పవర్ స్టార్ తో... రానా...?

by సూర్య | Wed, Oct 07, 2020, 07:20 PM

ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా వస్తున్నాయి. మంచి కథ దొరికి.. అందులోని పాత్రలు తమకు నచ్చితే కనుక ఇలాంటి సినిమాలు చేయడానికి మన హీరోలు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్నారు.


ఈ క్రమంలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి ఓ చిత్రంలో నటించనున్నారన్న వార్త తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గత కొంత కాలంగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ  ప్రయత్నాలు చేస్తోంది.


మొదట్లో ఈ రీమేక్ ను బాలకృష్ణతో చేయాలనుకున్నారు. అయితే, ఆయనకు సినిమా నచ్చకపోవడంతో ఆయన ఈ ప్రాజక్టు పట్ల ఆసక్తి చూపలేదట. తర్వాత ఒకరిద్దరిని అనుకున్నా వాళ్లూ డ్రాప్ అయ్యారు. చివరికి ఇప్పుడీ ప్రాజక్టు పవన్ కల్యాణ్ వద్దకు వచ్చింది. సినిమా చూసిన పవన్ ఇది చేయడానికి మొగ్గుచూపుతున్నారట.


ఇందులో మరో కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటిని నిర్మాత సంప్రదించారని, ఆయన కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే, ఈ ప్రాజక్టుకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాకపోవడం ఇక్కడ విశేషం. త్వరలోనే ఓ యంగ్ డైరెక్టర్ని ఖాయం చేస్తున్నారని సమాచారం.     

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM