by సూర్య | Wed, Oct 07, 2020, 04:05 PM
ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. విజయ్ కాంత్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ సతీమణికి సైతం కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చెన్నై నందబాక్కంలోని మియాట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. వారం పాటు చికిత్స తీసుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా మరోసారి కెప్టెన్ విజయ్కాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్కాంత్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ డీఎండీకే పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విజయ్కాంత్..తన తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం తాజాగా చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారని తెలిపింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మెుద్దు అంటూ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు విజయ్కాంత్ కూమారుడు కూడా తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
Latest News