మళ్లీ ఆస్పత్రిలో చేరిన నటుడు కెప్టెన్ విజయకాంత్

by సూర్య | Wed, Oct 07, 2020, 04:05 PM

ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్‌ మరోసారి ఆస్పత్రిలో చేరారు. విజయ్ కాంత్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ సతీమణికి సైతం కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన చెన్నై నందబాక్కంలోని మియాట్‌ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. వారం పాటు చికిత్స తీసుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే తాజాగా మరోసారి కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


ఈ నేపథ్యంలో విజయ్‌కాంత్‌ ఆరోగ్యంగానే ఉన్నారంటూ డీఎండీకే పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విజయ్‌కాంత్‌..తన తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం తాజాగా చైన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారని తెలిపింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను ఎవరూ నమ్మెుద్దు అంటూ ఆ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు విజయ్‌కాంత్‌ కూమారుడు కూడా తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

Latest News
 
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM
'బడే మియాన్ చోటే మియాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Fri, Apr 19, 2024, 07:41 PM
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM