by సూర్య | Wed, Oct 07, 2020, 11:44 AM
ముంబై – బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి ఇవాళ ముంబై హైకోర్టు బెయిల్ను మంజూరీ చేసింది. ఆమె సోదరుడు శౌవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆ ఇద్దర్నీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ కేసులోనే అరెస్టు అయిన శామ్యూల్ మిరిండా, దీపేశ్ సావంత్లకు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. మరో డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ బాసిత్కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు వ్యతిరేకించారు. దాదాపు నెల రోజుల తర్వాత రియాకు బెయిల్ మంజూరీ అయ్యింది. తనకు ఉన్న మాదకద్రవ్యాల అలవాటును కప్పిపుచ్చేందుకు సుశాంత్ సింగ్ తనను పావుగా వాడుకున్నట్లు రియా తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నది. తన సోదరుడు శౌవిక్ చక్రవర్తిని కూడా సుశాంత్ టార్గెట్ చేసినట్లు రియా పేర్కొన్నది. వాస్తవానికి ఈ కేసులో నిన్నే ప్రత్యేక కోర్టు రియా జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగించింది. డ్రగ్స్ కేసులో రియా 29 రోజుల పాటు జైలులో ఉన్నది నేడు బెయిల్ వాదనలు విన్న జస్టిస్ ఎస్వీ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఇవాళ రియాకు బెయిల్ మంజూరీ చేసింది.
Latest News