by సూర్య | Wed, Oct 07, 2020, 11:40 AM
యంగ్ హీరో తనీష్ హీరోయిన్ నీతీ టేలర్ షాకిచ్చింది. చాలా కాలంగా కనిపించకుండా పోయిన ఈ ముద్దుగుమ్మ సడన్ పెళ్లి చేసుకుని షాకిచ్చింది. తనీష్ హీరోగా నటించిన చిత్రం `మేం వయసుకువచ్చాం`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నీతి టేలర్. తొలి చిత్రం ముస్లీమ్ యువతిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత `పెళ్లి పుస్తకం`లో నటించింది. కానీ ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది.
ఆ తరువాత సినిమాల్లో కనిపించకుండా పోయింది. సినిమాలకు గత కొంత కాలంగా దూరంగా వుంటున్న నీతి టేలర్ ఆ తరువాత టీవి స్టార్గా మారింది. పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇదిలా వుంటే తాజాగా ఓ వీడియో, కొన్ని ఫొటోలని షేర్ చేసి తనకు పెళ్లైందని షాకిచ్చింది. ఆగస్టు 13న తాను వివాహం చేసుకున్నట్టు వెల్లడించింది.
తన చిరకాల మిత్రుడు పరీక్షిత్ భవను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. పెళ్లికి సంబంధించిన వీడియోని, ఫొటోలని షేర్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. కుటుంబ సభ్యుల, అత్యంత సన్నిహితుల మధ్య తన పెళ్లి వేడుక జరిగినట్టు తెలిసింది. కుమారి నుంచి శ్రీమతిగా మారానని, ఆగస్టు 13న వివాహం జరిగిందని, మా తల్లిదండ్రులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహంలో పాల్గొన్నారని ఇప్పుడు తాను హేయ్ హజ్బెండ్ అని గట్టిగా అరవగలనని నీతి టేలర్ తెలిపింది.
Latest News