యాంకర్ భాను శ్రీ ప్లాన్ ‘అదిరింది’

by సూర్య | Wed, Oct 07, 2020, 09:48 AM

అదిరింది షో గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌కు పోటీగా ఆ షో నుంచి బయటకు వచ్చిన నితిన్ భరత్‌లు అదిరింది షోను భారీగానే ప్లాన్ చేశారు. వీరికి మద్దతుగా నాగబాబు కూడా అదిరిందిలోకి వచ్చాడు. అయితే చాలా కష్టపడి అదిరిందిని ఓ మాదిరిగా హిట్ చేశారు. అయితే ఏనాడూ జబర్దస్త్ టీఆర్పీ రేటింగ్‌ను బీట్ చేయలేకపోయింది. అతి కష్టం మీద 25 ఎపిసోడ్‌లను పూర్తి చేశారు. ఇలా మైల్డ్ స్టోన్ ఎపిసోడ్ తరువాత అదిరిందిలో భారీ మార్పులు చేశారు.


అదిరింది షో పేరును బొమ్మ అదిరిందిగా మార్చేశారు. ఈ క్రమంలో చాలానే మార్పులు చేర్పులు చేశారు. ఈ షోకు మొదటి నుంచి యాంకరింగ్‌లో ఏదో సమస్య వస్తూనే ఉంది. మొదటగా సమీరాను యాంకర్‌గా ట్రై చేశారు. ఆమెతో కొన్ని రోజులు నెట్టుకొచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమెను తప్పించి భాను శ్రీని పట్టుకొచ్చారు. భాను శ్రీ, రవిల కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయింది. అయితే ఈ బొమ్మ అదిరింది అనే కొత్త షోలో ఆమెను తీసేశారు.


భాను శ్రీ, రవిని తప్పించి.. శ్రీముఖిని యాంకర్‌గా తీసుకొచ్చారు. అయితే భాను శ్రీ ఆ షోలో కనిపించకపోయే సరికి ఆమె ఫ్యాన్స్ హర్టైనట్టున్నారు. బ్రింగ్ బ్యాంక్ భాను శ్రీ, మళ్లీ భాను శ్రీని షోలో తీసుకోండని ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ పోస్ట్‌లను భాను శ్రీ కూడా తన ఖాతాలో పోస్ట్ చేసింది. అంటే ఆమె మనసులోనూ అదే కోరిక ఉన్నట్టుంది. మరి ఆమె కోరికను షో నిర్వాహకులు వింటారో లేదో చూడాలి.

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM