by సూర్య | Tue, Oct 06, 2020, 04:52 PM
కెరీర్ ఆరంభంలో అన్నీ పరాజయాలే ఎదుర్కొన్న శ్రుతీ హాసన్ పవన్ కల్యాణ్ `గబ్బర్సింగ్` సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. అయితే ఇటీవల ఓ ఆంగ్ల వెబ్సైట్తో మాట్లాడుతూ కమర్షియల్ సినిమాల గురించి తన మనసులో మాట బయటపెట్టింది. `ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయాలని చెప్పే వారి మాటలను ఇక వినాలనుకోవడం లేదు. నేను కొన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో భాగమయ్యాను. కానీ, నాకు అవి అంత సంతృప్తిని ఇవ్వలేదు. ఇప్పుడు నాకు నచ్చిన కథలను ఎంచుకోవడంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నానని శ్రుతి పేర్కొంది.
శ్రుతి వ్యాఖ్యల ఆధారంగా కొన్ని వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా `గబ్బర్సింగ్`, `రేసుగుర్రం` వంటి సినిమాలను శ్రుతి ఇష్టపడలేదని కథనాలు రాశాయి. దీంతో శ్రుతి తాజాగా స్పందించింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ట్వీట్ చేసింది. `జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ఇంటర్వ్యూ గురించి తెలుగులో వచ్చిన ఆర్టికల్స్ పూర్తిగా అవాస్తవాలు. `గబ్బర్సింగ్`, `రేసుగుర్రం` వంటి సినిమాల్లో భాగమైనందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. పవన్కల్యాణ్గారితో చేసిన `గబ్బర్ సింగ్` నా జీవితాన్ని మార్చింద`ని శ్రుతి పేర్కొంది.
Latest News