by సూర్య | Tue, Oct 06, 2020, 02:42 PM
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా నటుడు హర్షవర్ధన్ రాణే కరోనా బారినపడ్డారు. జ్వరం, కడపునొప్పి ఉండటంతో తాను పరీక్షలు చేయించుకున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ఆ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు హర్షవర్థన్ రాణే తెలిపారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. వైద్యుల సూచనలతో తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా, జిమ్ సర్బ్తో కలిసి తైష్' చిత్రంలో రాణే నటించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జీ5లో యాప్లో అక్టోబర్ 29న విడుదలకానుంది. హర్షవర్ధన్ బాలీవుడ్తో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. తకిట తకిట, నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, అనామిక, మాయా, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అవును-2, బెంగాల్ టైగర్తో పాటు పలు చిత్రాల్లో నటించారు.
Latest News