క్రేజీ మల్టీస్టారర్‌లో జగపతిబాబు..?

by సూర్య | Tue, Oct 06, 2020, 12:40 PM

శర్వానంద్‌తో ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'మహా సముద్రం'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సిద్ధార్ధ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తవ్వగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దర్శకుడు అజయ్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో విలక్షణ నటుడు జగపతిబాబు భాగం అవ్వనున్నారట. ఓ కీలక పాత్ర కోసం అజయ్‌, జగ్గుభాయ్‌ని కలవడం.. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మూవీలో జగపతి బాబు మరో అస్సెట్‌గా మారనున్నారు. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మహాసముద్రంను నిర్మిస్తుండగా.. బైలింగ్వల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌పై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Latest News
 
'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Apr 15, 2024, 10:37 PM
'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 15, 2024, 07:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్ Mon, Apr 15, 2024, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 15, 2024, 07:13 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' నార్త్ అమెరికా గ్రాస్ ఎంతంటే ...! Mon, Apr 15, 2024, 07:08 PM