ప్రధాని మోదీ ప్రశంసపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

by సూర్య | Sat, Apr 04, 2020, 12:21 PM

 కరోనా వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చిరంజీవి పలు వీడియోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల చిరంజీవి, నాగార్జున, యువ కథానాయకులు వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి కరోనాపై అవగాహన కల్పించే విధంగా రూపొందించిన "కరోనా పై ఫైట్" ఏదేమైనా చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా’ అంటూ సాగే ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ పాటను విన్న ప్రధాని నరేంద్రమోదీ ఆయా హీరోలను ప్రశంసించారు. ‘చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్‌, సాయి ధరమ్ తేజ్‌.. మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలోనే ఉందాం. సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.’ అని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.దీనికి స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిలో తమ వంతు సాయం చేస్తున్నామని టాలీవుడ్‌ అగ్రకథనాయకుడు చిరంజీవి అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి తన ట్విటర్‌ ఖాతా వేదికగా మోదీ ప్రశంసపై స్పందించారు. ‘మీ ప్రశంసకు ధన్యవాదాలు మోదీ గారు. మనదేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మీరు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి మహాకార్యంలో మేము మా వంతుగా చిన్న సాయం చేశాం. సంగీత దర్శకుడు కోటికి, మా అందరి తరఫున మీకు నా ధన్యవాదాలు’ అని చిరు ట్వీట్‌ చేశారు.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM