by సూర్య | Fri, Apr 03, 2020, 08:40 AM
తన ఇంటి దగ్గరలో పార్క్కి వెళ్లి ఫోటో షూట్ చేసింది నటి పాయల్ రాజ్ పుత్. దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమయ్యారు. కాని పాయల్ మాత్రం ఇల్లు వదిలి పార్క్ కి వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోషూట్ లో పాల్గొని ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన మీరు రూల్స్ అతిక్రమించడం ఎంత వరకు కరెక్ట్ అని పాయల్పై మండిపడ్డారు నెటిజన్స్. ఇంటికి సమీపంలోని పార్క్ అయినా ఈ క్రైసిస్ లో అలా వెళ్లడం కరెక్టేనా అంటూ పాయల్కి చురకలంటిస్తున్నారు.మరి పాయల్ ఏమంటుందో చూడాలి.
Latest News