ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్..?

by సూర్య | Thu, Apr 02, 2020, 01:20 PM

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం "రౌద్రం - రణం - రుధిరం"(ఆర్ఆర్ఆర్) మూవీని మరో హీరో రాంచరణ్‌తో కలిసి చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ నటించినున్నారు.


గత 2018లో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం వచ్చింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. ఇపుడు "ఆర్ఆర్ఆర్" ప్రాజెక్టు తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. అలాగే, త్రివిక్రమ్ ఇటీవలే "అల వైకుంఠపురములో" అనే బ్లాక్ బస్టర్ హిట్‌ను హీరో అల్లు అర్జున్‌కు అందించాడు.


ఈ పరిస్థితుల్లో జూనియర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న మూవీకి "అయినను పోయిరావలే హస్తినకు" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజా హెగ్డేతో పాటు.. అందాల నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలపై చిత్ర యూనిట్ ఓ అధికారిక ప్రకటన చేయాల్సివుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM