ముఖ్యమంత్రినే నిలదీసే పాత్రలో సాయితేజ

by సూర్య | Wed, Apr 01, 2020, 04:24 PM

సాయితేజ్ తాజా చిత్రంగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రూపొందింది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ తరువాత సినిమాను దేవ కట్టా దర్శకత్వంలో చేయడానికి సాయితేజ్ సిద్ధమవుతున్నాడు. భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ గా కనిపించనుందనే వార్తలు వచ్చాయి.


ఆమె ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషించనుందనేది తాజా సమాచారం. సాయితేజ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. నేటి విద్యా విధానంలోని లొసుగులపై తిరుగుబాటుతో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రినే నిలదీసే పాత్రలో సాయితేజ కనిపించనున్నాడని అంటున్నారు. రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM