by సూర్య | Wed, Apr 01, 2020, 03:25 PM
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల షూటింగులు లేక అందరూ సెలెబ్రెటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సూపర్ స్టార్ మహేష్ కూడా తన ఫ్యామిలీతో క్వారంటైన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య నమ్రత పిల్లలు సితార గౌతమ్ కృష్ణ లతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకడంతో మహేష్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే నమ్రత తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఫోటోలో మహేష్ బాబు తన లివింగ్ రూమ్ లో సోఫాపై నైట్ ట్రాక్ వేసుకొని కూర్చుని నవ్వుతూ ఉన్నాడు. ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది వాళ్ళ మధ్య ఏదో కామెడీ డిస్కషన్ జరుగుతుందని.
Latest News