by సూర్య | Tue, Mar 31, 2020, 07:43 PM
ఒకవైపు కమెడియన్ గా.. మరోవైపు హీరోగా నటిస్తూ తనకంటూ టాలీవుడ్ లో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు సప్తగిరి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కరోనా క్రైసెస్ చారిటీ కి సప్తగిరి రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.